రాహుల్కి బ్రాహ్మణ యువతితో పెళ్లి చేయాలని చెప్పా, ఎందుకంటే..?: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended Video
అమరావతి/న్యూఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహ విషయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల నిర్వహించిన ఓ సభలో అనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మంచి బ్రాహ్మణ అమ్మాయితో వివాహం జరిపించాలని సోనియా గాంధీకి తెలిపానని చెప్పారు.
When I was in Congress I suggested to Sonia Gandhi that Rahul needs support of UP Brahmins. Brahmin community is ruling in UP.That is why I suggested to her that get Rahul married to a good Brahmin girl . But Sonia Gandhi didn’t listen to me: JC Diwakar Reddy,TDP MP (4.7.18) pic.twitter.com/AXHl1MR5UA
— ANI (@ANI) July 6, 2018
ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులదే పైచేయి అని, కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణుల మద్దతు కావాలన్న జేసీ దివాకర్ రెడ్డి.. బ్రాహ్మణ యువతితో పెళ్లి జరిపిస్తే వారి సామాజిక వర్గ మద్దతు లభిస్తుందని సోనియాకు చెప్పానని తెలిపారు.
అయితే, తన సూచనను సోనియా పట్టించుకోలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. జూలై 4న జరిగిన ఓ కార్యక్రమంలో జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చే శారు. వాస్తవానికి రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రాయ్బరేలీ ఎమ్మెల్యే సదర్ అదితి సింగ్.. కాంగ్రెస్ చీఫ్కు ప్రపోజ్ చేసినట్లు వార్తలు వ్యాపించాయి. రాహుల్, అదితి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ తనకు సోదరుడి లాంటి వాడని ఆమె ఆ వార్తల్ని కొట్టిపారేశారు.