పోలవరం ప్రాజెక్టు కేసులో కీలక మలుపు: తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్లో అభిప్రాయ సేకరణ
న్యూఢిల్లీ/హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కేసు గురువారం కీలక మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పార్టీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయ భవిష్యత్తుపై తేల్చేశారు
తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అఫిడవిట్లో పేర్కొనాలని కేంద్రానికి సూచించింది. ప్రజాభిప్రాయానికి సంబంధించిన విధి విధానాలు ఏమిటో పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది.
పోలవరం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.