హైకోర్టులో తేల్చుకోండి: సదావర్తి భూములపై సుప్రీం కోర్టు
సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.
అమరావతి/న్యూఢిల్లీ: సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.
వేలం జరిగిన భూములు తమ పరిధిలోనే ఉన్నాయని, ఆ కారణంతో తమను కూడా ఈ విచారణలో ఇంప్లీడ్ చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేసింది.
ఈ రోజు దానిపై విచారించిన సుప్రీం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఏపీ, తమిళనాడుల్లో భూయాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని ఆదేశిస్తూ ఈ కేసును ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసింది.
ఈ ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసింది. యాజమాన్య హక్కులు ఎవరివో హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అదే విధంగా వేలంలో మొదటి బిడ్డర్ గడువులోగా స్పందించకుంటే రెండో బిడ్డర్కు ఇచ్చే అంశాన్ని హైకోర్టు తేలుస్తుందన్నారు.