సుప్రీంకోర్టులో సీఎం వైఎస్ జగన్ ‘లేఖ’పై విచారణ: నేడే విచారించనున్న సుప్రీంకోర్టు, తేలనున్న భవితవ్యం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్న ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
Recommended Video
ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు కాగా, వాటిని సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎస్ రవింద్ర భట్ ధర్మాసనం ఈ విచారణను నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీలను, హైకోర్టు న్యాయమూర్తులను విమర్శించే అధికారం ముఖ్యమంత్రికి లేవని, న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రను కాపాడాల్సిన అవసరం ఉందని కోరుతూ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు కాగా, వాటిని సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎస్ రవింద్ర భట్ ధర్మాసనం ఈ విచారణను నిర్వహిస్తారు.
సుప్రీంకోర్టు జడ్జీలను, హైకోర్టు న్యాయమూర్తులను విమర్శించే అధికారం ముఖ్యమంత్రికి లేవని, న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రను కాపాడాల్సిన అవసరం ఉందని కోరుతూ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.