హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులు: భర్తపై సూరీడు కూతురు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sureedu's daughter complaints on husband
హైదరాబాద్: తన భర్త తనను వేధిస్తున్నారంటూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు కూతురు గంగాభవాని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సురేంద్రనాథ్ రెడ్డితో తనకు మూడేళ్ల క్రితం వివాహమైందని ఆమె తెలిపారు.

పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి శ్రుతిమించడంతో కొంతకాలంగా హైదరాబాదులోని తన తండ్రి నివాసంలో ఉంటున్నానని వివరించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేంద్రనాథ్ రెడ్డి, తల్లిదండ్రులను పిలిపించారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం చట్టబరంగా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయనకు వ్య్కితగత సహాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే.

English summary
Sureedu's daughter complaints in Central Crime Station on her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X