అర్ధరాత్రి వారి మధ్య ఏం జరిగింది? పెళ్లైన వాడికి ఇచ్చేవాడిని కాదు: సూర్యకుమారి పేరెంట్స్
తన కూతురు సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడని, పెళ్లైన వారికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసేవాడిని కాదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విజయవాడ: తన కూతురు సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడని, పెళ్లైన వారికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసేవాడిని కాదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ను అరెస్టు చేశారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు పరిచారు.
సూర్యకుమారి కేసులో కొత్త ట్విస్ట్... కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానం
తల్లిదండ్రుల అనుమానాలు
విజయవాడ వైద్యురాలు సూర్యకుమారి అదృశ్యం కేసు విషాధాంతం అయిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహం నిడమానురు వద్ద రైవస్ కాలువలో పోలీసులు గుర్తించారు. కూతురు మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు.
Recommended Video
అర్ధరాత్రి అతని ఇంటికి
సూర్యకుమారి విషయమై ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. సూర్యకుమారి అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్లిందని చెప్పారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలని డిమాండ్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
గంటకు పైగా అక్కడే ఉంది
సూర్య కుమారి గంటకు పైగా అక్కడే ఉందని తల్లిదండ్రులు చెప్పారు. కానీ ఆ తర్వాత ఎక్కడకు వెళ్లిందో తనకు తెలియదని విద్యాసాగర్ చెప్పడం దారుణం అన్నారు. ఆసుపత్రిలో వైద్యం చేయాల్సిన తన కూతురు శవమై వచ్చిందన్నారు.
భార్యే నిజాలు చెబుతోంది
విద్యాసాగర్ గురించి ఆయన భార్యే తన భర్త గురించి నిజాలు చెప్పిందని తల్లిదండ్రులు అన్నారు. కాగా, సూర్య కుమారి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వివాహితుడు జయరాజు తనయుడు విద్యాసాగర్ను ప్రేమించింది.
రహస్యంగా కలుసుకునేవారు
వీరిద్దరు తరుచూ రహస్యంగా కలుసుకునేవారని దర్యాఫ్తులో తేలింది. ఈ క్రమంలో 31న అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన బైక్పై బయటకు వెళ్లింది. విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయి, విగతజీవిగా కనిపించింది.