గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెడపై ఆయిల్ పూసి!: హత్యేనా?, బాబాయి, కూతురు అనుమానాస్పద మృతి!

బలవంతంగా అతనిని కట్టేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్‌ కలిపి తాగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలోని అమృతలూరులో ఓ బాలిక, ఆమె బాబాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. సంఘటన తీరు చూస్తే.. ఇది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

జంట హత్యల కలకలం: బాబాయి, చిన్నారి కూతురు దారుణహత్యజంట హత్యల కలకలం: బాబాయి, చిన్నారి కూతురు దారుణహత్య

అమృతలూరు-పెదపూడి గ్రామాల మధ్య తెనాలి-చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అటు పక్కగా వెళ్లిన కొంతమందికి మృతదేహాలు కంటపడటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

 నేపథ్యం:

నేపథ్యం:

అమృతలూరుకు చెందిన రాపర్ల సుబ్బి కృష్ణ, ఝాన్సీవల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్‌ బాబుకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడు సతీష్‌‌కు కొన్ని నెలల క్రితమే వివాహం జరిగింది.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాపర్ల సతీష్‌కు, యలవర్రులో ఎస్సీ మాల వర్గానికి చెందిన సజనకుమారితో పెద్దలు వివాహం జరపించారు. అయితే భార్యతో తలెత్తిన విభేదాల కారణంగా అతని కాపురం సజావుగా సాగడం లేదని తెలుస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.

గత కొన్నేళ్లుగా సతీష్, సురేష్ ఇద్దరూ గ్రామ దేవత పుట్లమ్మ తల్లిగుడి పక్కనే ఉన్న షాపును అద్దెకు తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణ వ్యాపారం సాగిస్తున్నారు.

 చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ:

చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ:

సతీష్‌కు అన్న రెండో కుమార్తె చరితాచౌదరి అంటే చాలా ప్రేమ. ఎప్పుడూ ఆమెతో గడపడానికే ఇష్టపడేవాడు. ఎక్కడికెళ్లినా ఆమెను వెంట తీసుకెళ్లేవాడు. ఇదే క్రమంలో తమ ఎరువుల షాపుకు సంబంధించి తెనాలిలో ఆడిట్ ఉందని, అలాగే దీపావళి టపాసులు కొనుక్కొస్తానని చెప్పి చరితను తీసుకుని సోమవారం సాయంత్రం వెళ్లాడు. అయితే అర్థరాత్రి కావొచ్చినా ఇద్దరూ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పలు చోట్ల వెతికినా లాభం లేకుండా పోయింది. ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో ఎక్కడికెళ్లారో అర్థం కాలేదు.

Recommended Video

Bigg Boss Show In Dera, Shocking ! ‘డేరా’లో ఎన్నో ఘోరాలు: రియాల్టీషోలు! బిగ్‌బాస్‌ కూడా | Oneindia
 వైన్ షాపు వద్ద మృతదేహాలు:

వైన్ షాపు వద్ద మృతదేహాలు:

పెదపూడి గ్రామాల మధ్యలో మూసేసిన ఓ వైన్‌ షాపు దుకాణం వద్ద బాలిక మృతదేహం, షాపు ముందు సతీష్‌ మృతదేహాలను స్థానికులు గుర్తించారు. విషయం కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతుడు సతీష్‌ వద్ద ఒక బ్లేడు, కొంత నగదు, సెల్‌ఫోన్‌ గుర్తించారు.

హత్యేనా?, మెడ చుట్టూ ఆయిల్:

హత్యేనా?, మెడ చుట్టూ ఆయిల్:

సతీష్ చేతిపై బ్లేడుతో కోసిన గాట్లు ఉండటంతో ఇది హత్యా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బలవంతంగా అతనిని కట్టేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్‌ కలిపి తాగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులిద్దరి మెడలపై నల్లటి ఆయిల్‌ పూసి ఉండటం గమనార్హం.

గుర్తు పడుతుందేమోనన్న భయంతోనే పసి పిల్ల అని కూడా చూడకుండా చరితను కూడా దుండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary
An uncle and his daughter are died suspiciously in Guntur district, few are alleged that it was a murder by some one
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X