'అఖిలప్రియ సహా భూమా కుటుంబానికి నేనున్నా, ధైర్యంగా ఉండండి'
భూమా కుటుంబానికి తాను ఉన్నానని ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు. తల్లిదండ్రులు లేని లోటు పూడ్చలేమని, కానీ వారికి లోటు లేకుండా చూసుకుంటానని చెప్పారు. భూమా లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నారు.
ఆళ్లగడ్డ: భూమా కుటుంబానికి తాను ఉన్నానని ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు. తల్లిదండ్రులు లేని లోటు పూడ్చలేమని, కానీ వారికి లోటు లేకుండా చూసుకుంటానని చెప్పారు. భూమా లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నారు.
ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల టిడిపి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. భూమా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాలు చేశారన్నారు. అందరి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
భూమా మృతిపై వైసిపి ఎమ్మెల్యే వైవీ, అఖిలప్రియ బాధ్యత ఇక ఎస్వీదే
తమ కుటుంబానికి భూమా కుటుంబం చాలాసార్లు అండగా నిలిచిందని, శోభా, భూమా నాగిరెడ్డిల మృతితో విషాదంలో ఉన్న భూమా కుటుంబానికి అండగా ఉంటామని, భూమా మృతి తీరని లోటు. ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
కాగా, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో జిల్లా సచివాలయంపై ఉన్న జాతీయ జెండాను అవనతం చేశారు. ఆయన మృతికి సంతాప సూచకంగా జెండాను కిందకు దించారు.