వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"బిజెపి మోసం చేసింది": "చంద్రబాబు అన్నీ తానే చేశానంటాడు"

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కళ్యాణ్ వల్లే ప్రత్యేక హోదా...!

విజయవాడ: బిజెపిపై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపి ఇప్పుడు అందరినీ మోసం చేసిందని విమర్శించారు.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదానే లక్ష్యం కావాలని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మంచిది కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చాణక్య నీతితో అందరినీ కలుపుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలని ఆయన అన్నారు.

Tammareddy Bharadwaj blames BJP

అవిశ్వాస తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తనకు అనుకూలమై మీడియాలో అంతా తానే చేసినట్లు ప్రచార చేసుకుంటున్నారని అన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తామే ఎక్కువ సాధించామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రమే ఇవ్వడం లేదని అంటున్నారని ఆయన తప్పు పట్టారు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు తీరును ఎండడుతారని ఆయన శనివారం నెల్లూరులో అన్నారు.

English summary
Film producer Thamam Reddy Bharadwaja has blamed BJP on the issue of special category status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X