‘కొత్త శత్రువులకు నమస్కారం’: టీడీపీ వర్సెస్ బీజేపీ, ‘సోము ఓ శకుని! బాబు చెప్పినవారే ప్రధాని’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సభ్యుల మధ్య సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు, రాష్ట్ర మహిళా ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
ఇటీవలే టీడీపీ, బీజేపీలు తమ మిత్రబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు వర్షం కురిపించుకుంటున్నాయి.
కొత్త శుత్రువులకు స్వాగతం
ఈ క్రమంలోనే ‘కొత్త శత్రువులకు నమస్కారం' అంటూ మాణిక్యాలరావును మంత్రి కళా వెంకట్రావు వెటకారంగా పలకరించగా.. ‘అడ్వాన్స్ కంగ్రాట్స్' అంటూ మాణిక్యాలరావుకు నన్నపనేని రాజకుమారి అభినందనలు తెలిపారు. దీంతో స్పందించిన మాణిక్యాలరావు.. తాను బీజేపీ ఏపీ అధ్యక్షుడిని కావడంలేదని, సోము వీర్రాజు అవుతారని స్పష్టం చేశారు.
ఢిల్లీ వస్తున్నా! 3రోజులు అక్కడే.. ‘లాలూచీ' కాదు: ఎంపీలతో చంద్రబాబు, ‘వైసీపీకి అదే భయం'
సోము వీర్రాజే మీకు కరెక్ట్
తాను సైతం సోము వీర్రాజు పేరునే ప్రతిపాదించానన్నారు. ఇందుకు స్పందించిన నన్నపనేని.. మీరే భాజపా ఏపీ అధ్యక్షుడని అందరూ అంటున్నారని అన్నారు. సోము వీర్రాజు అయితేనే మీ(టీడీపీకి)కు సరిపోతాడని ప్రతిస్పందించిన మాణిక్యాలరావు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఏపీకి వెన్నుపోటు: మోడీ, బాబును ఏకేసిన వరప్రసాద్, రాజీనామాలు, ఆమరణ దీక్షపై జగన్
జగన్తో భేటీ.. సోము వీర్రాజు ఓ శకుని..
ఇది ఇలావుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు.. వైసీపీ అధినేత జగన్తో 2 గంటల పాటు రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు. సోము వీర్రాజు శకుని రాయబారం చేస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
లండన్లో మాల్యాతో బాబు భేటీ, రూ.కోట్ల విరాళం!: విజయసాయి సంచలనం, ‘ఢిల్లీకి అందుకే'
బాబు చెప్పినవారే ప్రధాని
వీర్రాజు అవినీతి కూడా సీఎం డాష్ బోర్డులో ఉందని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఓ వైపు బీజేపీ, మరో వైపు వైసీపీ కలిసి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ ప్రాంతాలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. 2019లో తమ టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తే.. వారే ప్రధాని అవుతారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
ఇంకా వుంది, త్వరలోనే ప్రకటిస్తా: పవన్ ‘స్వాగతం'పై లక్ష్మీనారాయణ