వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్

|
Google Oneindia TeluguNews

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంలో గతంలో ఎప్పుడైన ఇన్ని ఉద్యోగాలు కల్పించారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటనలతో బీసీ, ఎస్టీ, మైనారీటి పిల్లలు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. మరోవైపు సచివాలయ పరీక్షలో లీకు గురించి వచ్చిన వార్తలు నిరూపించుకోకపోతే పత్రికా యజమాన్యాన్ని నడిబజారులో నిలబెడతామని ఆయన హెచ్చరించారు.

గ్రామ సచివాల ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయని పేర్కోంటూ మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై వైసీపీ ఎమ్మెల్యో జోగి రమేష్ మండిపడ్డారు. మీడియాలో ప్రచారం కోసమే చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో లక్ష 27 వేల ఉద్యోగాలను భర్తి చేయలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. 14 సంవత్సరాల ఆయన పరిపాలనో డీఎస్సీలతో కలుపుకుని ఎనాడైన లక్ష 27వేల ఉద్యోగాలు భర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు. కాని అలాంటీ వ్యక్తి ఏపీ ఏర్పాటు తర్వాత లక్షల ఉద్యోగాలు ఎలాంటీ అటంకం లేకండా భర్తి చేశామని లేఖలో పేర్కోవడం సిగ్గుచేటని ఆయన విమర్శిచారు.

 TDP chief Chandrababu Naidu Creating False Propaganda in village secretariat jobs :mla Jogi Ramesh

ఇన్ని లక్షల ఉద్యోగాలు ఒక్కోసారి భర్తి చేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి ధీరుడు,దీశాలీ అంటూ ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులతోపాటు,ఎస్టీ,ఎస్టీ మైనారటీ విద్యార్ధులంతా వైఎఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశ్వాసంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నమ్మకాన్ని ప్రజల నుండి దూరం చేసేందుకే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.

English summary
TDP chief Chandrababu Naidu Creating false propaganda about village secretariat jobs, YCP MLA Jogi Ramesh criticised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X