ఆంధ్రాబ్యాంకు విలీనం వద్దు, కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు
ఆంధ్రా బ్యాంకును విలీనం చేయవద్దంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారమన్కు లేఖ రాశారు. ఈనేపథ్యంలో ఆంధ్రబ్యాంకు విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని లేఖలో పేర్కోన్నారు. ఆ పేరు తెలుగువాళ్ల సెంటిమెంట్తో ముడిపడి ఉందని తెలిపారు. ఇక తెలుగు వాళ్ల నమ్మకం పెంచుతూ ఆంధ్రబ్యాంక్ పలు సేవలు అందించిందని చెప్పారు. ఒక వేళ బ్యాంకుల విలీననం అవసరమైతే ఆంధ్రాబ్యాంకు పేరునే కొనసాగించాలని ఆయన లేఖలో పేర్కోన్నారు.
ఆర్ధిక సంస్కరణలో పాటు బ్యాంకులను నష్టాల బాటనుండి గట్టేక్కించేందుకు కొద్ది రోజుల క్రితం పలు బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో బాగంగానే దశబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంకు సైతం నష్టాల్లో ఉండడంతో దాన్ని యూనియన్ బ్యాంకులో వీలినం చేశారు. అయితే విలీన ప్రక్రియను స్వాగతించిన టీడీపీ అధినేత చంద్రబాబు విలీన ప్రక్రియ ప్రజల్లో నమ్మకం పెంచుతుందని అన్నారు. అయితే ఆంధ్రాబ్యాంకును మాత్రం విలీనం చేయద్దని కేంద్రానికి లేఖ రాశారు.