54 మంది ఎంపీలతో సంతకాలు చేయిస్తాం: టిడిపి ఎంపీలు
న్యూఢిల్లీ: తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అవిశ్వాస తీర్మానం ద్వారా కేంద్రానికి తగిన బుద్ధి చెప్తామని వారన్నారు. తోట నర్సింహ, సిఎం రమేష్ తదితరులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు నోటీసుపై సోమవారానికి 54 మంది సభ్యుల సంతకాలు సేకరిస్తామని చెప్పారు.
తమ పార్టీపై కుట్ర జరుగుతోందని వారన్నారు. అందుకే ఎన్డీఎ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఎపి హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు.
కాగా, తమ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశశుద్ది లేదని ఆయన అన్నారు.