బంద్: జగన్ పార్టీకి టిడిపి కౌంటర్, బుచ్చయ్యపై రాళ్లు
గురువారం టిడిపి సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ బిల్లుపై చర్చకు నిరసనగా రేపు సీమాంధ్ర బందుకు తమ పార్టీ పిలుపునిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పైన మండిపడ్డారు. జగన్ కోరేది సమైక్యం, సహకరించేది విభజనకన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగల పార్టీ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో లోపాలు ఉన్నాయని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు.
బుచ్చయ్య చౌదరిపై రాళ్ల దాడి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి పైన రాళ్ల దాడి జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావును పలువురు టిడిపి నేతలు అడ్డగించి వాంబే గృహాల కేటాయింపు అంశంపై నిలదీశారు. ఈ సమయంలో రౌతు, టిడిపి నేత బుచ్చయ్య చౌదరి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు చౌదరి పైన రాళ్ల దాడి చేశారు. ఆయనను కారులో అక్కడి నుండి తరలించారు.