'స్క్రిప్ట్ రాయించి మరీ భూమాపై టీడీపీ అలా!, ఆ యాక్టింగ్కు కమల్ కూడా పనికిరారు'
టీడీపీ నేతల యాక్టింగ్ ముందు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు కూడా పనికిరారని ఎద్దేవా చేశారు.
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణానికి సీఎం చంద్రబాబు ఆయనపై పెట్టిన ఒత్తిడే కారణమంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనిపై స్పందించారు.
చంద్రబాబు తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి 'టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పదవి కోరుకోలేదని పేర్కొంటూ స్క్రిప్ట్ రాయించి మరీ' కొందరితో చదివించారని చెవిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల యాక్టింగ్ ముందు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు కూడా పనికిరారని ఎద్దేవా చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా తిరుపతిలో భూఆక్రమణల గురించి ప్రస్తావించారు. వీటిపై కలెక్టర్, తహశీల్దారులను ప్రశ్నిస్తే.. వారు చెబుతున్న సమాధానాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని చెవిరెడ్డి అన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.