వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్... రామ్‌మాధవ్ చేతికి కీలకపత్రాలు: బుగ్గనకు టీడీపీ ఝలక్, స్పీకర్‌కు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన నిర్ణయం

అమరావతి: పీఏసీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొత్త ట్విస్ట్. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దానికి కౌంటర్‌గా ఇప్పుడు టీడీపీ నేతలు బుగ్గనపై స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు.

బుగ్గన టీడీపీ నేతలపై సభా హక్కుల నోటీసు ఇస్తే, టీడీపీ నేతలు కూడా స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు సంచలన ఆరోపణలు చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేత రామ్ మాధవ్‌కు కీలక పత్రాలు అందించారని ఆరోపించారు.

బీజేపీతో భేటీపై ట్విస్ట్: టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్బీజేపీతో భేటీపై ట్విస్ట్: టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

TDP leaders complaint to speaker against Buggana

పీఏసీ చైర్మన్‌గా ఆయన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేతలకు కీలక పత్రాలు అందించారని చెప్పారు. కాబట్టి బుగ్గనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కీలక పత్రాలు అందించడం సరికాదన్నారు. కాగా, బుగ్గనపై ఎస్వీ మోహన్ రెడ్డి, హనుమంతరాయ చౌదరిలు ఫిర్యాదు చేశారు.

English summary
Telugudesam Party leaders complaint to speaker against YSR Congress party MLA Buggana Rajendranath Reddy on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X