వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: సోము వీర్రాజు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు ఇతర తెలుగుదేశం నేతలు తమ డ్రామాలను ఇకనైనా ఆపాలని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం వారు చేస్తున్న దీక్షలు బూటకమని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు అడిగితే స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌లు అసలే ఇవ్వమని సోము వీర్రాజు అన్నారు.

అవినీతిపరులకు దూరంగా ఉండాలని మోడీ ఎప్పుడో చెప్పారని సోము గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పై యుద్ధం చేస్తున్న వారు మూతపడ్డ స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు తెరిపించలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. బీజేపీపై దాడులు, ధర్మపోరాలు ఇకనైనా ఆపాలన్న సోము వీర్రాజు... చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు.

TDP leaders must stop the drama, fires somu veera raju

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు టీడీపీ కంకణం కట్టుకుందని అన్నారు.

ఏపీలో బీజేపీ చేసిన అభివృద్ధి పై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఇందుకు టీడీపీ సిద్ధమేనా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. అవినీతి పరులకు సహకరించవద్దని మోడీ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సోము వీర్రాజు తెలిపారు.

English summary
AP Bjp senior leader Somu Veera Raju fired on TDP and Chief Minister Chandra Babu Naidu. He called the TDP leaders indefinite hunger strike as fake. When the steel plant was shut down why din't these leaders make any attempt to reopen it, questioned Veeraraju. Prime Minister Modi had repeatedly told to maintain distance with the corrupted people, reminded veera raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X