వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల ఆత్మహత్యపై గవర్నర్ తో రేపు తెలుగు తమ్ముళ్ళ భేటీ .. విచారణ చెయ్యాలని కోరనున్న టీడీపీ

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేధింపులు, హింస ఎక్కువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.ఇక ఈ క్రమంలో గురువారం టిడిపి నేతలు ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ను కలిసి కోడెల ఆత్మహత్యపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని టిడిపి నేతలు గవర్నర్ హరిచందన్ ను కోరనున్నారు. కోడెల విషయంలో ఏం జరిగింది ? ఆయన ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ? అన్న అంశాలపై వారు గవర్నర్ తో చర్చించనున్నారు.

TDP leaders will meet governor tomorrow about kodela suicide

అంతేకాకుండా టిడిపి కీలక నేతలపై పెడుతున్న కేసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ప్రభుత్వం పెడుతున్న కేసులను, జరుగుతున్న దాడులను ఈ సంద్భంగా గవర్నర్‌కు నేతలు వివరించనున్నారు టిడిపి నేతల బృందం.

English summary
On Thursday, TDP leaders will meet AP Governor Harichandan to complain about Kodela's suicide. The TDP leaders have asked Governor Harichandan to hold an inquiry into the circumstances that have led to suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X