వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ..వారి సొంత ప్రయోజనాలకే బడ్జెట్ : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

|
Google Oneindia TeluguNews

ఏపీని వైసిపి నాశనం చేస్తోందని మండిపడుతున్నారు టిడిపి నేతలు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. నేడు ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలియజేయాలని భావిస్తున్న టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి నేతల అరెస్టులకు తాము నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

ఎవరు అడ్డొచ్చినా ఫినిష్ ... రేపు అసెంబ్లీలో జరిగేదిదే .. జేసీ దివాకర్ రెడ్డి జోస్యంఎవరు అడ్డొచ్చినా ఫినిష్ ... రేపు అసెంబ్లీలో జరిగేదిదే .. జేసీ దివాకర్ రెడ్డి జోస్యం

టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లు కక్షసాధింపు చర్య

టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లు కక్షసాధింపు చర్య

టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లు కక్షసాధింపు చర్య అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పారాసిటమాల్ చాలు అంటూ కరోనాను తేలిగ్గా తీసుకున్నారని నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. పేదలను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఒకపక్క మద్యపాన నిషేధం చేస్తున్నామని చెబుతూనే, ఏపీలో కొత్త బ్రాండ్ లను జె టాక్స్ కోసం దింపారని ఆయన విమర్శించారు.

వారి సొంత ప్రయోజనాల కోసమే బడ్జెట్

వారి సొంత ప్రయోజనాల కోసమే బడ్జెట్

లాక్ డౌన్ తో మద్యానికి దూరంగా ఉన్న ప్రజలకు మళ్లీ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చి పేదల జీవితాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని రామానాయుడు మండిపడ్డారు. ఇసుక మాఫియా రెచ్చిపోతుంది అని ఇసుక దొరకకుండా చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ మంత్రులు వారి సొంత ప్రయోజనాల కోసం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారని, దాని ఆమోదం కోసం హడావిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?
అసెంబ్లీ వేదికగా నిరసనలు

అసెంబ్లీ వేదికగా నిరసనలు

ప్రభుత్వ వైఫల్యాలను టిడిపి నేతలు అసెంబ్లీలో నిలదీయనున్నారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ నేడు అసెంబ్లీలో నిరసన తెలియజేయాలన్న వ్యూహంతో టిడిపి,అందించిన సంక్షేమ పథకాలను తెలియజేసి, బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవాలని వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం తాజా రాజకీయ పరిణామాలతో అధికార వైసీపీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .

English summary
the YCP ministers are introducing the budget for their own purposes and are holding meetings in a hurry for its approval. The TDP leaders are going to hold the government's failures in the assembly, said Nimmala Ramanaidu. Today, however, the YCP is strategically working to ensure that the budget is approved by the TDP and the welfare schemes provided by the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X