జగన్పై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు- పులివెందుల పిల్లి అంటూ- పొన్నూరులో సగం కట్టిన గోడపై..
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ప్రతీ చిన్న అంశం కూడా పెద్దదిగా మారిపోతోంది. తాజాగా ఇదే కోవలో గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ ప్రభుత్వ భవనం ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లపై పోలీసులు అతన్ని అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ జగన్ను ఉద్దేశించి చేసిన కామెంట్లు మరింత వివాదాస్పదం అయ్యాయి.
పులివెందుల పిల్లి టిడిపి కార్యకర్తలను చూసి భయపడుతుంది.సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటు.
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020
గోడ గ్రాండ్ ఓపెనింగ్ ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టిడిపి కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్టు చెయ్యడం...(1/2) pic.twitter.com/ZdCVkMhrjd
గుంటూరు జిల్లా పొన్నూరులో సగం కట్టిన గోడకు గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త మణిరత్నం చేసిన పోస్టుకు అతన్ని అరెస్టు చేయడం దారుణమని లోకేష్ విమర్శించారు. పులివెందుల పిల్లి టీడీపీ కార్యకర్తలను చూసి భయపడుతోందని సీఎం జగన్ను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సగం కట్టిన గోడకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయాలనుకోవడమే సిగ్గుచేటని, గోడ గ్రాండ్ ఓపెనింగ్ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తను అరెస్టు చేయడం మరింత దారుణమని లోకేష్ విమర్శించారు.
పొన్నూరులో టీడీపీ కార్యకర్త అరెస్టు ప్రభుత్వ పిరికితనాన్ని బయటపెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ఆరోపించారు. వైసీపీ నాయకులు చెప్పినట్లు ఆడుతున్న కొంత మంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేదేమీ ఉండదని, ప్రతిగా కష్టాలు కొని తెచ్చుకోవడం తప్ప అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులపై దుమారం చెలరేగుతుండగానే తాజాగా పోలీసులు టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని అరెస్టు చేయడం విమర్శలకు తావిస్తోంది.