వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రెడ్డి .. ఆ ఘనత మీదే .. మేం వాటిని సన్మానాలుగా భావిస్తాం : కేశినేని నానీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని , ఆయన పాలనను ఉద్దేశించి ఫైర్ అయ్యారు . ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసిన కేశినేని నానీ తనపై, తమ పార్టీ ఎంపీలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయారు . రాజధాని అమరావతి రైతుల తరపున పోరాటం చేస్తున్న తమపై కక్షగట్టారని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి ... ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని టీడీపీ ఎంపీ కేశినేని నానీ తేల్చి చెప్పారు.

ఇది రౌడీ, పోలీసుల రాజ్యం..మహిళల పాస్ పోర్టులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు: కేశినేని నానీఇది రౌడీ, పోలీసుల రాజ్యం..మహిళల పాస్ పోర్టులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు: కేశినేని నానీ

 ఎంపీలపై మీరు పెట్టే కేసులను సన్మానాలుగా భావిస్తామన్న ఎంపీ కేశినేని నానీ

ఎంపీలపై మీరు పెట్టే కేసులను సన్మానాలుగా భావిస్తామన్న ఎంపీ కేశినేని నానీ

అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్రం కోసం రైతులు కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎంపీ గళ్ళ జయదేవ్, కనకమేడల రవీంద్ర, కేశినేని నానీలపై నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో అంటూ తమను జగన్ ఏమీ చెయ్యలేడని ఆయన పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఎపీలను అరెస్ట్ చేసి , కేసులు పెట్టి చిత్రహింసలను గురి చేసిన తీరుపై కేశినేని నానీ మండిపడ్డారు .

న్యాయం కోసం నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని మండలి చైర్మన్ కు కితాబు

న్యాయం కోసం నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని మండలి చైర్మన్ కు కితాబు

ఇక అంతే కాదు మండలిలో టీడీపీ విజయం సాధించటంతో మండలి చైర్మన్ షరీఫ్ ను ఆయన కొనియాడారు. నీతి, నిజాయితీకి మారుపేరు ముస్లింలు.విశ్వసనీయతకు నిలువుటద్దం ముస్లిం సమాజం అని కేశినేని నానీ పేర్కొన్నారు . విలువలకు కట్టుబడి నిబద్ధతతో ఈ రోజు న్యాయం కోసం నిలబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ గారికి హృదయ పూర్వక అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు .

 నీ ఫ్యాక్షనిష్టు మెంటాలిటికి మూల్యం చెల్లించుకుంటావ్ అని ఫైర్

నీ ఫ్యాక్షనిష్టు మెంటాలిటికి మూల్యం చెల్లించుకుంటావ్ అని ఫైర్

ఇక నిన్నటికి నిన్న జగనన్నా ..ఇదేమి ప్రజాస్వామ్యం అంటూ కౌన్సిల్ లో సీసీటీవీలు, టీవీలు బంద్ చేసి కౌన్సిల్ సభ్యులు కాని 22 మంది నీ మంత్రులతో కౌన్సిల్ లో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నావ్. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇంత హంగామా జరగలేదు. నీ ఫ్యాక్షనిష్టు మెంటాలిటికి మూల్యం చెల్లించుకుంటావ్ అని నిప్పులు చెరిగిన కేశినేని నానీ ఎంత నిరంకుశంగా వ్యవహరించినా టీడీపీ ఎంపీలు, నాయకులు భయపడేది లేదని రాజధాని అమరావతి విషయంలో వెనక్కు తగ్గేదిలేదని తేల్చి చెప్పారు.

English summary
In the wake of the latest political developments in AP, TDP MP Kesineni Nani fires on YCP chief AP CM Jagan Mohan Reddy and his administration . Commenting on the Twitter platform, Kesineni Nani said that he and his party MPs are trageted by ycp false allegations. He alleged that the tdp was fighting on behalf of the capital farmers. Jagan Reddy ... No matter how many cases are filed we will not afraid, TDP MP Kesineni Nani said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X