ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్పై ఎంపీ మురళీమోహన్ చంద్రబాబుకు ఫిర్యాదు, ఎందుకంటే?
అమరావతి: సినీ నటులను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన ఎంపీ, సినీ నటుడు మురళిమోహన్ చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు టెలికాన్పరెన్స్ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మురళీమోహన్ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సినీ నటులు ఎందుకు నోరు తెరవడం లేదని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్రమైన విమర్శలు చేశారు. అవార్డులు రాకపోతే నానాయాగీ చేసే సినీ నటులు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంటే ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడ తీవ్రంగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై టిడిపికే చెందిన రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కూడ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు
గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీలతో టెలికాన్పరెన్స్ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ నటులపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
Recommended Video
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు, టెక్నీషీయన్లు మాట్లాడిన విషయాన్ని మురళీమోహన్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆ రకంగా మాట్లాడాల్సింది కాదని మురళీమోహన్ చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు.అయితే ఈ విషయమై తాను టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్తో చర్చిస్తానని బాబు టిడిపి ఎంపీ మురళీమోహన్ దృష్టికి తీసుకువచ్చారు.