అమిత్ షాతో టీడీపీ ఎంపీలు... ధన్యవాదాలు తెలిపిన నేతలు
ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ ఎంపీలు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మి, రవీంద్రకుమార్ అమిత్ షాను కలిసిన వారిలో ఉన్నారు. అయితే వారి భేటి మర్యాదపూర్వకంగానే జరిగిందని ఎంపీలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని ఇండియా మ్యాప్లో చేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం రాష్ట్ర పరిస్థితులపై సమావేశం అయ్యోందుకు అవకాశం ఇవ్వాలని అమిత్ షాను కోరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే ఎంపీలు ఎప్పుడు వచ్చినా...తనను కలుసుకోవచ్చని అమిత్ హామీ ఇచ్చినట్టు చెప్పారు.
కొన్ని రోజుల క్రితం సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన భారతదేశ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకపోవడంతో రాజకీయంగా దుమారం రేపింది. దీంతో టీడీపీపై తీవ్ర ప్రభావం పడింది. ఆ పార్టీ చేసిన అభివృద్ది, అమరావతి నిర్మాణం చేసిన కృషి పలు విమర్శలు ఎదుర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో ప్రస్తావించారు. స్యయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి నిర్మాణం మ్యాప్లో లేకపోవడం పై ఆయన ప్రశ్నించారు. దీంతో స్పందించిన కేంద్రం మ్యాప్లో అమరావతికి చోటు కల్పించింది.