టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్య .. దారికాచి మరీ హతమార్చిన దుండగులు
ఏపీలో రాజకీయనాయకుల హత్యలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు హత్యకు గురైతే, ఇక టిడిపి సానుభూతిపరుల, కార్యకర్తల, గ్రామ స్థాయి నేతల హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యారు.
అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలా
నాగాయలంక మండలం లోని పర్ర చివర శివారు పెదగౌడపాలెం కు చెందిన తాత సాంబశివరావు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్రచివర ఎంపీటీసీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయనను దారికాచి మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. పాత కక్షలు ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నాగాయలంక లో పని పూర్తి చేసుకొని పెద పాలెం మీదుగా మెరక పాలెం వెళుతుండగా జన సంచారం లేని నిర్మానుష్య ప్రదేశంలో పక్కా ప్లాన్ తో మారణాయుధాలతో దాడి చేసిన దుండగులు సాంబశివరావును హతమార్చారు.
Recommended Video
పాత కక్షలలో భాగంగా ఈ దారుణం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు ఈ దారుణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. గతంలో సాంబశివరావు పరిశె చంటి అనే వ్యక్తి పై దాడి చేసి గాయపరిచాడు. అయితే ఆ కేసులో చంటికి న్యాయం జరగక పోవడంతో ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భాగంగా టిడిపి నాయకుడు సాంబశివరావుపై పక్కా ప్లాన్ తో మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.