ఎన్డీఎకు గుడ్బై, అమిత్ షాకు బాబు లేఖ: మోడీ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సొంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
పోలిట్బ్యూరో సభ్యులతో చంద్రబాబు అత్యవసరంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఎతో తెగదెంపులు చేసుకోవాలని పోలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో కూడా ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఎలో ఉంటూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయంపై జాతీయ స్థాయిలో ప్రచారంలోకి తేవాలని ఆయన సూచించారు.
ఎన్డీఎ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. తాము ఎన్డీఎ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులపై ఆయన లేఖలో వివరించినట్లు తెలుస్తోంది.