వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఎకు గుడ్‌బై, అమిత్ షాకు బాబు లేఖ: మోడీ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సొంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

పోలిట్‌బ్యూరో సభ్యులతో చంద్రబాబు అత్యవసరంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఎతో తెగదెంపులు చేసుకోవాలని పోలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించుకున్నారు.

TDP to propose No confidence motion on Modi Govt

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో కూడా ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఎలో ఉంటూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయంపై జాతీయ స్థాయిలో ప్రచారంలోకి తేవాలని ఆయన సూచించారు.

ఎన్డీఎ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. తాము ఎన్డీఎ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులపై ఆయన లేఖలో వివరించినట్లు తెలుస్తోంది.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu lead Telugu Desam party (TDP) has decided to propose No confidence motion on Narendra Modi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X