ఈ వ్యర్థ ప్రసంగాలేంటి, సీఎంకు ఇన్నేళ్లు పట్టిందా: గల్లా ప్రసంగంపై పవన్
Recommended Video
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదవి విరిచారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా గల్లా దాదాపు గంట పాటు కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్తో కలిసి.. దులిపేసిన ఎంపీ
తాజాగా, జనసేన అధినేత పవన్ స్పందించారు. లోకసభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు పవన్ వరుస ట్వీట్లు చేశారు.
సభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందని, ప్యాకేజీకి అంగీకరించడానికి గల కారణాలు చెప్పలేదన్నారు.
'వ్యక్తిగత లాభాల కోసం స్పెషల్ క్యాటగిరి స్టేటస్కు మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా?' అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
TDP’s argument is very weak & feeble in parliament session today.I feel they lacked the necessary moral fibre to take SCS demand forward as they had opposed, weakened & diluted the SCS ‘cause of their special package acceptance earlier.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’ కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా?
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారని మరో ట్వీట్ పెట్టారు. వ్యక్తిగత లాభాల కోసం టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిందని, టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అవిశ్వాసం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందాల్సిన టీడీపీ దానిని దారుణంగా మిస్ చేసుకుందని విమర్శలు గుప్పించారు.
AP ప్రజలు’ - టీడీపీ నాయకులకి ఎలా కనిపిస్తున్నారు? pic.twitter.com/kfZysCJ4qO
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
TDP has compromised on special category status for party & personal gains. They had lost trust of people.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
TDP has lost a great opportunity to win people of AP
At every stage TDP had colluded & compromised with BJP leadership on SCS. Now what they are doing is eye wash & political theatrics for public consumption.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి,ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా... కేంద్రం చేత మోసగింపపడ్డాం ..అంటే,ప్రజలు నమ్ముతారు .. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు?
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018