అర్ధరాత్రి ఇంట్లో దూరి టీడీపీ సర్పంచ్ను నరికి చంపారు
మాచవరం మండలంలోని వేమవరం తెలుగుదేశం సర్పంచ్ శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు నిద్రిస్తున్న శ్రీనివాసరావును నరికి చంపారు.
గుంటూరు: మాచవరం మండలంలోని వేమవరం తెలుగుదేశం సర్పంచ్ శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు నిద్రిస్తున్న శ్రీనివాసరావును నరికి చంపారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనివాసరావు హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
శ్రీనివాసరావును ప్రతిపక్షాలు చంపించాయా? లేక ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలుపొందిన శ్రీనివాసరావు .. గత కొంత కాలం క్రితం టీడీపీలో చేరారు. అయితే, వాటర్ ప్లాంట్ విషయంలో కొందరితో ఈయనకు వివాదం ఉన్నట్లు తెలిసింది.