వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై వైసీపీ అవిశ్వాసానికి బాబు మద్దతు, ఏం జరుగుతోంది?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతు? జగన్ ను మళ్ళి ఇరికించిన బాబు

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతివ్వాలని టిడిపి నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే కేంద్రంపై వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకొంది.

కేంద్రంపై రేపే వైసీపీ అవిశ్వాసం: మద్దతివ్వాలంటూ టీడీపీ సహా అన్ని పార్టీలకూ లేఖలుకేంద్రంపై రేపే వైసీపీ అవిశ్వాసం: మద్దతివ్వాలంటూ టీడీపీ సహా అన్ని పార్టీలకూ లేఖలు

ఏఫీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు అమరావతిలో మంత్రులతో సుధీర్ఘంగా మంతనాలు నిర్వహించారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో చర్చించారు.

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఇతర త్రా వ్యవహరాలపై చంద్రబాబునాయుడు చర్చించారు. రాష్ట్రంలో చోటతు చేసుకొన్న వేగంగా మార్పులు చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలపై కూడ బాబు చర్చించారు.

 వైసీపీ అవిశ్వాసానికి టిడిపి మద్దతు

వైసీపీ అవిశ్వాసానికి టిడిపి మద్దతు

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ మార్చి 16న, అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది. ఈ తీర్మానానికి టిడిపి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకొనే ప్రతి ఒక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

వైసీపీ అవిశ్వాసానికి ఎందకు మద్దతివ్వాలన్న మంత్రులు

వైసీపీ అవిశ్వాసానికి ఎందకు మద్దతివ్వాలన్న మంత్రులు

వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి ఎందుకు మద్దతివ్వాలని చందద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో కొందరు మంత్రులు బాబును ప్రశ్నించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే వైసీపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు మంత్రులకు సూచించారు.

 అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైసీపీ

అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైసీపీ

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ గురువారం నాడు అవిశ్వాస నోటీసును ఇచ్చింది. 198 కింద నోటీసును ఇచ్చింది. శుక్రవారం నాడు పార్లమెంట్‌లో ఈ విషయమై చర్చకు వస్తోందో లేదా అనేది చూడాలి. అయితే వైసీపీ అవిశ్వాస తీర్మానానికి టిడిపి కూడ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకగా ఉన్న పార్టీలు మద్దతుగా నిలుస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అవిశ్వాస తీర్మానం చర్చకు రాదు

అవిశ్వాస తీర్మానం చర్చకు రాదు

అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం లేనే లేదని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలను నిర్ణీత షెడ్యూల్‌ కంటే ముందుగానే నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందని, దీంతో వైసీపీ మార్చి 16న, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తోంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 15న, వైసీపీ నోటీసును ఇచ్చింది. ఏపీ ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాసంలో ఏపీకి చెందిన టిడిపి, వైసీపీ నేతలు ఏకమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

English summary
Tdp decided to support ysrcp no cofidence motion on union government . Tdp chief Chandrababu Naidu conducted meeting with ministers and senior mlas on Thursday at Amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X