వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీగౌతమి హత్య: సొంత నేతలపై టీడీపీ వేటు, ఆ అధికారులపై వేటు కోసం సోదరి
నరసాపురం: శ్రీగౌతమిది హత్యేనని సీఐడీ తేల్చి చెప్పడంతో తెలుగుదేశం పార్టీ, టీడీపీ ప్రభుత్వంలో నిందితులు, అందుకు సహకరించిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులపై టీడీపీ చర్యలు తీసుకోగా, అధికారులపై వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
చదవండి: అక్క కేసులో చెల్లెలు పట్టు: అప్పుడే శ్రీగౌతమితో పరిచయం, రహస్యంగా పెళ్లి.. భార్యకు తెలిసి..
నిందితుల్లో నర్సాపురం జెడ్పీటీసీ ఉన్నారు. ఆయనతో సహా పార్టీకి సంబంధం ఉన్న వారిని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అలాగే, హత్యను ప్రమాదకోణంలో చిత్రీకరించిన వారిపై కూడా చర్యలకు తీసుకోనుంది.
ఈ ప్రమాదం విషయంలో బాధితుల గోడు వినకుండా కేసు మూసేసిన అధికారుల పైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోనుంది. ఏఎస్పీ రత్న పైన చర్యలు తీసుకోవాలని శ్రీగౌతమి సోదరి పావని డిమాండ్ చేస్తోంది.
Comments
English summary
Telugudesam Party on Thursday suspended accused of Sri Gouthami murder case.