తెలుగు పద్యం అప్పజెప్పలేదని.. విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్!
తెలుగు పద్యం అప్పజెప్పలేదనే కోపంతో ఓ టీచర్ కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలం డి.భీమవరం గ్రామం రెసిడెన్సియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమరావతి: తెలుగు పద్యం అప్పజెప్పలేదనే కోపంతో ఓ టీచర్ కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలం డి.భీమవరం గ్రామం రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న పి.గాంధీ.. విద్యార్థులను తెలుగు పద్యం అప్పజెప్పమన్నారు. అయితే, విద్యార్థులు ఆ పద్యాన్ని చెప్పలేకపోయారు. దీంతో, ఆగ్రహించిన గాంధీ తన కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టాడు.
ఈ ఘటనపై పాఠశాలలో పనిచేస్తున్న తోటి టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా గిరిజన సంక్షేమ అధికారి జల్లి శాంబుడు పాఠశాలలో విచారణ జరిపారు. ఆయన నివేదిక అందిన తర్వాత ఉన్నతాధికారులు టీచర్ గాంధీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ''చెప్పుతో కొట్టడమేకాక, ఆ విషయం బయటకు చెబితే పదో తరగతి పరీక్షల్లో అందరినీ ఫెయిల్ చేసేస్తా అని టీచర్ గాంధీ మా పిల్లల్ని బెదిరించాడు..'' అని చెప్పారు. పాఠశాల హెడ్ మాస్టర్ కూడా గాంధీకే మద్దతు పలుకుతున్నారని వారు ఆరోపించారు.