ఎవరికైనా చెప్తే చంపేస్తా.. బెదిరిస్తూ బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
మహిళలు,బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా దేశంలో నిత్యం మహిళలు, బాలికలు మీద లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైంగిక దాడులకు చెక్ పెట్టడం కోసం దిశా చట్టం తీసుకొచ్చినా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
తల్లా .. పెళ్ళామా.. ఇద్దరూ కాదు.. షెల్టర్ హోంకు పంపమన్న కోర్టు .. ట్విస్ట్ ఏంటంటే !!
మదనపల్లెలో ఉపాధ్యాయుడి దారుణం
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయులే నీచమైన పనికి దిగజారడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దినేష్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరిస్తూ ఘాతుకానికి పాల్పడుతున్నాడు .
బాలిక ప్రవర్తనలో మార్పు .. విషయం చెప్పిన బాలిక .. కేసు నమోదు
దీంతో భయపడిన బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంది. అయితే బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఉపాధ్యాయుడు చేస్తున్నది బాలిక తల్లిదండ్రులకు చెప్పింది .వెంటనే బాలిక తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నైతిక విలువలు మరచిపోతున్న ఉపాధ్యాయులు .. కఠినంగా శిక్షించాలని స్థానికులు
ఏది ఏమైనా పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువలు నేర్పాల్సిన గురువులే నైతిక విలువలు మరచి చిన్నారుల జీవితాన్ని ఛిద్రం చేయడం శోచనీయం. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ,ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వారు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Recommended Video