వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదం: టెక్ మహీంద్రా ఉద్యోగి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు.
కృష్ణా: జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
హెల్మెట్ ఉన్నప్పటికీ ఆ వాహనం బలంగా ఢీకొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం. కాగా, ఈ ప్రమాదంలో వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
ఇతడు కూడా టెక్ మహీంద్రా ఉద్యోగే. వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
English summary
A tech mahindra employee killed in a accident in Krishna district.
Story first published: Saturday, July 29, 2017, 9:51 [IST]