వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బందర్ టెక్కీ అనూహ్య రేప్, హత్య కేసు: చంద్రభానుకు ఉరిశిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ అత్యాచారం, హత్యకు గురైన బందర్ టెక్కీ అనూహ్య కేసులో దోషిగా తేలిన చంద్రభాన్ సదమ్ సనప్‌కు ముంబై న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. న్యాయస్థానం శుక్రవారం తీర్పును వెల్లడించింది.

అనూహ్య పైన దారుణానికి ఒడిగట్టిన చంద్రభానుకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నాడు న్యాయస్థానం దోషి శిక్షను ఖరారు చేసింది.

Techie Anuhya case: death verdict against Chandrabhan

ఉరిశిక్ష వేయాలి: అనూహ్య తండ్రి

తన కూతురు అనూహ్యను హత్య చేసిన చంద్రభానుకు ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రులు మొదటి నుంచి కోరుతున్నారు. ముంబై న్యాయస్థానం కూడా దోషికి ఉరిశిక్ష విధించింది. దీంతో అనూహ్య కుటుంబ సభ్యులో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అనూహ్య కేసులో చంద్రభాన్ సుదమ్ సనప్‌ను ముంబై కోర్టు నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది. అనంతరం శిక్ష ఖరారును తొలుత బుధవారానికి వాయిదా వేసింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుధవారం కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు శిక్ష ఖరారును ఈ రోజుకు వాయిదా వేసింది.

English summary
Techie Anuhya case: death verdict against Chandrabhan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X