జేసీపై పోస్ట్, రంగంలోకి పోలీసులు: 'విజయమ్మని తిట్టినప్పుడేం చేశారు'
తాడిపత్రి ఎమ్మెల్యే, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిందుకు గాను ఇప్పాల రవీందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిందుకు గాను ఇప్పాల రవీందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మీడియా: మరికొంతమంది జగన్ ఫ్యాన్స్ అరెస్ట్కు రంగం, లిస్ట్ ఇదేనంటూ..?
ఇప్పాల రవీంద్రను కోర్టులో హాజరుపరిచినట్లుగా తాడిపత్రి పట్టణ సీఐ భాస్కర్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు.
జేసీపై అనుచిత వ్యాఖ్యలపై సావిత్రి ఫిర్యాదు
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేశాడంటూ జడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి మార్చి 7న మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పట్టణ పోలీసులకు బదిలీ చేశారు. అప్పటి నుంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టెక్కీ అరెస్ట్
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇప్పాల రవీంద్రను శుక్రవారం విశాఖ కారాగారం నుంచి కేసు నిమిత్తం పట్టణానికి తీసుకువచ్చినట్లు సీఐ చెప్పారు.
మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 15 రోజుల రిమాండ్ విధించారు. విశాఖలో మరో కేసులో నిందితుడుగా ఉన్నందున బెయిల్ మంజూరు చేసి ఆ కేసు నిమిత్తం రవీంద్రను వైజాగ్కు తరలించారు.
వైసిపి నాయకుల ఆందోళన
ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు, అక్కడి నుంచి కోర్టుకు వద్దకు చేరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటారని ఈ సందర్భంగా మాజీ ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు.
జగన్, విజయమ్మను తిట్టినప్పుడేం చేశారు
ఇదే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిపక్ష నేత జగన్, విజయమ్మలను పోలీసు ఉన్నతాధికారులు, మీడియా ఎదుటే అనకూడని మాటలు అన్నారని, అయినా వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని విమర్శించారు.
నిందితుడిని కలుసుకునేందుకు వైసిపి నేతల ప్రయత్నం
టిడిపి నాయకులు చెప్పినట్లుగానే పోలీసులు వింటున్నారని, తమ కార్యకర్తకు తామంతా ఉన్నామనే ధైర్యం కల్పించడం కోసమే ఇక్కడికి వచ్చామని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. మరోవైపు నిందితుడిని నిందితుడిని కలుసుకోవడానికి వైసిపి నాయకులు వచ్చారు.