కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: పెళ్లి చూపుల ఫోటోకు వెళ్తూ టెక్కీ మృతి

బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట. బావ లక్ష్మన్నతో కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ టెలికాం నగర్లో ఉంటున్నారు.

శనివారం ఉదయం బెంగళూరు నుంచి తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి తన బావ ఇంటికి వ చ్చాడు. పెళ్లి చూపులకు సంబంధించి ఫోటోలు దిగేందుకు సాయంత్రం బావతో కలిసి బైక్ పైన వెళ్తున్నాడు.

 Techie dead in road accident in Kurnool district

లక్ష్మన్న వాహనం నడుపుతుండగా జగన్మోహన్ రెడ్డి బైక్ పైన కూర్చున్నాడు. వారు పాత ఆర్టీవో కార్యాలయం వద్దకు వెళ్లగానే వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా ఢీకొంది. వారు కింద పడ్డారు.

<strong>ఉన్మాదం: ప్రేమించలేదని నిశ్చితార్థానికి ముందు రోజు చంపేశాడు</strong>ఉన్మాదం: ప్రేమించలేదని నిశ్చితార్థానికి ముందు రోజు చంపేశాడు

జగన్మోహన్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం సాక్ష్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Techie dead in road accident in Kurnool district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X