హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టెక్కీ అదృశ్యం, ఆదివారం అర్ధరాత్రి ఇంటికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Techie goes missing
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అదృశ్యమైన టెక్కీ శ్రీలత ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. శుక్రవారం మాయమైన శ్రీలత ఆదివారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. హైటెక్ సిటీలో ఐటి ఉద్యోగిగా పని చేస్తున్న శ్రీలత శుక్రవారం కిడ్నిప్ అయినట్టుగా ఆమె భర్త కిరణ్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన భార్యను కిడ్నాప్ చేసిన దుండగులు తనకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని భర్త కిరణ్ పోలీసులకు చెప్పారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం సాయంత్రం హైటక్ సిటీ నుండి ఇంటికి స్కూటీలో బయల్ధేరిన శ్రీలత మార్గమధ్యంలో అపహరణకు గురైంది.

ఆమె స్కూటీ ఆర్‌సీని బట్టి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఆదివారం అర్ధరాత్రి శ్రీలత తన ఇంటికి క్షేమంగా చేరుకుంది. ఆమె నుండి మేడ్చల్ పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం త్వరలోనే నిందుతులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

శుక్రవారం ఆమె మిస్ అయ్యాక ఆమె ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనానని పోలీసులు ఈఎంఆర్ఐ వద్ద గుర్తించారు. కిరణ్, శ్రీలత దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి మేడ్చల్‌లోని సూర్యా నగర్ కాలనీలో ఉంటున్నారు. కిరణ్ మండల పరిధిలోని శాంతి బయోటెక్నిక్ కంపెనీలో, శ్రీలత హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఐటి మేనేజరుగా చేస్తున్నారు.

English summary
A woman software professional has been goes missing from Hyderabad on Friday night. Reportedly she came to house on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X