పరువు హత్య: టెక్కీ కూతుర్ని చంపిన పేరెంట్స్ (ఫోటో)
గుంటూరు: తన కూతురు ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నందుకు గుంటూరు జిల్లాలో ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు కడతేర్చిన విషయం తెలిసిందే. గుంటూరులోని రాజేంద్ర నగర్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడికి చెందిన పచ్చల దీప్తి 2010 నుండి సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు.
తన సహోద్యోగి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కిరణ్తో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు. దీంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించేందుకు దీప్తి విఫలయత్నం చేశారు. వేరే సంబంధాలు చూడటంతో ఈ నెల 21న దీప్తి, కిరణ్లు ఈ నెల 21న హైదరాబాదులోని ఆర్య సమాజ మందిరంలో వివాహం చేసుకున్నారు.
దీప్తి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం గుంటూరుకు వచ్చారు. అదే సమయంలో దీప్తి, ఆమె భర్త కిరణ్ను ఆమె తల్లిదండ్రులు పిలిపించారు. దీంతో ఆదివారం వారు గుంటూరుకు వచ్చారు. ఆదివారం రాజేంద్ర నగర్లోని తమ ఇంట్లో స్నానాలు చేసి వస్తామని కూతురు దీప్తిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకు వచ్చి చున్నీతో ఉరిపోసి హత్య చేసి, ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
దీప్తి సెల్కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో కిరణ్ పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించారు. కిరణ్ ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. దీప్తి మెడకు చున్నీ బిగించి ఉంది. దీంతో తల్లిదండ్రులతో ఆమె పెనుగులాడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.