అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు, వెంకయ్య ఎక్కాక మొరాయించిన హెలికాప్టర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రయాణించే హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తింది. గురువారం నాడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగసభలో వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే.

అనంతరం వారు విజయవాడ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. ఈ సమయంలో హెలికాప్టర్‌లో మొరాయించింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్‌ గుర్తించి, వారికి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారిద్దరూ రోడ్డుమార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

Photos: చంద్రబాబు శంకుస్థాపన

Technical problem in helicopter, Chandrababu reaches Vijayawada on road

హెలికాఫ్టర్ టేకాఫ్ కష్టమన్న సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు కూడా పైలెట్ తెలియజేశాడు. దీంతో వారి ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా వీరిని పంపించారు. జాతీయ రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

English summary
Technical problem in helicopter, Chandrababu reaches Vijayawada on road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X