పూరీ జగన్నాథ్పై గట్టి ఆధారాలు?: హీరో తనీష్ సాక్ష్యం అత్యంత కీలకం!
డ్రగ్ కేసు విచారణలో సోమవారం నటుడు తనీష్ను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారించనుంది. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. విచారణ ఎదుర్కొంటున్న 11వ వ్యక్తి తనీష్.
హైదరాబాద్: డ్రగ్ కేసు విచారణలో సోమవారం నటుడు తనీష్ను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారిస్తోంది. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. విచారణ ఎదుర్కొంటున్న 11వ వ్యక్తి తనీష్. కెల్విన్, జీషాన్లతో సంబంధాలపై ప్రశ్నించనున్నారు.
అసలేం జరిగింది? నవ్వుతూ వెళ్లి, డల్గా రవితేజ: పూరీనే అంటే ఎలా, ఆ ప్రశ్న ఎక్కడిది.. సిట్కు ధీటుగా
పూరీపై అభియోగాల మీదత తనీష్ సాక్ష్యం కీలకం
ఆయన పది గంటల సమయానికి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మెట్లు ఎక్కి లోనికి వెళ్లారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పైన వచ్చిన అభియోగాలపై తనీష్ సాక్ష్యం కూడా అత్యంత కీలకమని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ్ పైన గట్టి ఆధారాలు సంపాదించిన సిట్
డ్రగ్ వ్యవహారంలో పూరీ జగన్నాథ్ ప్రమేయంపై ఇప్పటికే సిట్ గట్టి ఆధారాలు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనీష్ సాక్ష్యం కీలకం కానుందని అంటున్నారు.
వాట్సాప్ సందేశాలు
కెల్విన్ ఫోన్లో తనీష్ నంబర్ ఉండటం, వారిద్దరి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు, వాట్సాప్ సందేశాలు జరిగినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.
తనీష్కు పబ్బులకు వెళ్లే అలవాటు
తనీష్కు పబ్బులకు వెళ్లే అలవాటు ఎక్కువని, నవదీప్, తరుణ్లతో పాటు ఎన్నోసార్లు పార్టీల్లో పాల్గొన్నాడని, పూరీ జగన్నాథ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకూ హాజరయ్యే వాడని అంటున్నారు.