వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు తెలంగాణ సెగ: సిఎంకు చిరంజీవి ఎమ్మెల్యే అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బుధవారం తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లంగర్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని పలువురు తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సిఎం ధిక్కరించలేదు: వంగా గీత

తమ పార్టీ అధిష్టానాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడు ధిక్కరించలేదని శాసన సభ్యురాలు వంగా గీత వేరుగా అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో మంగళవారం పలువురు నేతలు భేటీ కావడంపై స్పందిస్తూ.. ఎవరికి వ్యతిరేకంగా వారు సమావేశం కాలేదని చెప్పారు. తనకు సమైక్యాంధ్రే ముఖ్యమని, వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదన్నారు.

మహాత్ముడికి నివాళి

బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శాసన సభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి, సభాపతి నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్కలు నివాళులు అర్పించారు.

గాంధీ విగ్రహావిష్కరణ

కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశాల్లో గౌరవిస్తున్న రీతిలో గాంధీని మనం గౌరవించడం లేదన్నారు.

English summary
Telanganites tryied to obstruct CM Kiran Kumar Reddy's convoy at Langa House on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X