ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: తెలంగాణ, హైదరాబాద్కు అగ్రస్థానం, ఏపీ వాదన ఇదీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సరళతర వ్యాపార నిర్వహణ)లో తెలుగు రాష్ట్రాలు ఒకటి, పదిహేనో స్థానాల్లో నిలిచాయి.భారత్లో రాష్ట్రాల వారీగా చూస్తే సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే విషయంలో తెలంగాణ తొలి స్థా
హైదరాబాద్/అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సరళతర వ్యాపార నిర్వహణ)లో తెలుగు రాష్ట్రాలు ఒకటి, పదిహేనో స్థానాల్లో నిలిచాయి.
Recommended Video
ఒకేసారి 30 స్థానాలు ఎగబాకిన భారత్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 100వ స్థానం
మొదటి స్థానంలో తెలంగాణ, 15వ స్థానంలో ఏపీ
భారత్లో రాష్ట్రాల వారీగా చూస్తే సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే విషయంలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు 15వ స్థానం దక్కింది.
హైదరాబాద్కు రెండో స్థానం
తెలంగాణకు మొదటి స్థానం రాగా, ఏపీకి 15వ స్థానం రావడం గమనార్హం. ఇక భారత్లోని 17 నగరాలలో జరిపిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ వివరణ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి 15వ ర్యాంకు రావడంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ ర్యాంకును అది తోసిపుచ్చింది. నివేదిక పంపించేందుకు నవంబర్ 7వ తేదీ వరకు సమయం ఉందని చెప్పింది.
ఇదీ ఏపీ సర్కార్ వాదన
చాలా రాష్ట్రాలు వ్యూహాత్మకంగా నివేదికలను చివరి నిమిషంలో అప్ లోడ్ చేస్తాయని ఏపీ ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రాల నివేదికలను పరిశీలించిన అనంతరం డిసెంబర్లో ఫైనల్ ర్యాంకులు వచ్చే అవకాశముందనేది ఏపీ సర్కార్ వాదన.