విషాదం: కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: కెనడలోని ఫాంసన్ రివర్స్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్న తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రావులపల్లి లక్ష్మణ్రావు,లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు వంశీకృష్ణ, రాజీవ్కృష్ణలు. వీరిద్దరూ విదేశాలల్లోనే ఉన్నారు.
దంపతులిద్దరూ హైదరాబాదు నగరంలోని మణికొండలో జైహింద్వ్యాలీలోని ఫ్లాట్లో నివాసముంటున్నారు. చిన్న కొడుకు రావులపల్లి రాజీవ్కృష్ణ్ణ(28)గత ఆగస్టులో కెనడాలోని ఫాంసన్ రివర్స్ యూనివర్సీటీలో ఎంబీఏ చదివేందుకు వెళ్లాడు. 12వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో రాజీవ్ మరణించాడు.
మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా కెనడా పోలీసులు కుటుంబసభ్యులకు ఆదివారం రాత్రి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కుటుంబసభ్యులు పార్లమెంట్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ ఎంపీ జితేందర్రెడ్డిని కలిసి విన్నవించారు.
ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మాస్వరాజ్కు సమాచారం అందించి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.