చైనా అమ్మాయి, తెనాలి అబ్బాయి, పెద్దలను ఒప్పించారిలా
చైనాకు చెందిన యుయు అనే యువతిని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వరుణ్ ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించారు.
గుంటూరు:ప్రేమకు కులాలు,మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, దేశాలు అడ్డు కావని నిరూపించారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. చైనాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను వివాహం చేసుకొన్నాడు.
ప్రపంచ దేశాల సంస్కృతిసంప్రదాయాలను అధ్యయనం చేయడానికి ఇండియా నుండి వంద మందితో కూడిన బృందం చైనాను సందర్శించింది. ఈ బృందంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వరుణ్ కూడ ఉన్నాడు.
చైనా ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఒక్కోక్కరికి ఒక్కో చైనీయుల కుటుంబాన్ని కేటాయించారు.అయితే వరుణ్ కు యుయు ఇంట్లో బస చేశాడు.
చైనాలో ఉన్నంతకాలం వరుణ్ వారింట్లోనే ఉన్నాడు. దీంతో యుయుతో ఏర్పడిన పరిచయం వారిద్దరి మద్య ప్రేమగా మారింది. ఇద్దరూ కూడ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.
2014 లో యుయు ఇండియాకు వచ్చింది తెనాలిలోని వరుణ్ కుటుంబసభ్యులతో గడిపి వెళ్ళింది.తర్వాత ఇరువైపులా కుటుంబాల పెద్దలు వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకొన్నారు.
జర్మనీలో పిహెచ్ డి చేస్తోన్న వరుణ్ తన చదువు పూర్తికావడంతో గురువారం నాడు తిరుపతిలో హిందూ సంప్రదాయం ప్రకారంగా యుయును వివాహం చేసుకొన్నాడు.