వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బాబు వెళ్ళనిది అందుకే .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు .తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించటంతో కేజ్రీవాల్ మరో మారు సీఎం అవుతున్నారని, అయినా ఏ రాష్ట్రంలో సీఎంల ప్రమాణ స్వీకారం అయినా తగుదునమ్మా అంటూ వెళ్ళే చంద్రబాబు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణాలు సైతం చెప్పిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా బాబును , బాబు భజన సంఘాన్ని తిట్టిపోశారు .

<strong>బీజేపీ ఎంపీని వెనకేసుకొచ్చిన వైసీపీ ఎంపీ: టీడీపీ చెప్పింది నిజమైందా?</strong> బీజేపీ ఎంపీని వెనకేసుకొచ్చిన వైసీపీ ఎంపీ: టీడీపీ చెప్పింది నిజమైందా?

 బీజేపీ భయంతోనే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళనిది

బీజేపీ భయంతోనే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళనిది

ఇక ఆయన చేసిన ట్వీట్ లో ఎంపీ విజయ సాయి రెడ్డి ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్నా చంద్రబాబు తన నమ్మకస్తులను పంపి ఆహ్వానం సంపాదించేవారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో లేపోయినా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లే దమ్ము ఆయనకు లేదని పేర్కొన్నారు . ఎందుకంటె బీజేపీ పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడుతారో అని బాబు వణుకుతున్నారని విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . అప్పట్లో చంద్రబాబు తెగ చక్రం తిప్పారని , అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో అని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు .

రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే మోడీ అక్షింతలు వేశారా ? అని మండిపాటు

రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే మోడీ అక్షింతలు వేశారా ? అని మండిపాటు

అలాగే మీడియాలో కూడా చంద్రబాబు అనుకూల మీడియా ఉందని, దాన్ని భజన సంఘం అంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి . చంద్రబాబు అనుకూల మీడియాను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి బాబు సీఎంగా లేకపోవడంతో కిరసనాయిలు ఆంధ్రప్రదేశ్‌ నాశనం కావాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గంటన్నరసేపు సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే , అది కాకుండా పీపీఏలపై మోదీ మందలించాడని తప్పుడు వార్తలు రాశారని ఆయన చంద్రబాబు అనుకూల మీడియా అంటూ నిప్పులు చెరిగారు .

మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలా అని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ

మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలా అని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ

చంద్రన్న భజన పరాకాష్టకు చేరిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు . చంద్రబాబు, ఆయన బానిస మీడియా ఇంతగా కుళ్లుకుంటున్నారంటే తిన్నది ఒంటబట్టడం లేదని విజయసాయి విమర్శలు గుప్పించారు . చంద్రబాబు కంటి నిండా నిద్ర పోవడం లేదని తెలిసిపోతోందని ఆయన పేర్కొన్నారు . దోపిడీ రోజులు పోయాయన్నారు . నిజాయితీ, విశ్వసనీయతల విలువేమిటో ప్రజలు గ్రహించారని పేర్కొన్న విజయసాయి పచ్చ తెరల లోకం నుంచి బయటకు రండి అంటూ వ్యాఖ్యానించారు . మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు.

English summary
YSRCP MP Vijayasayara Reddy criticized TDP President and former CM Chandrababu Naidu. chandrababu did not going to the delhi CM Kejriwal oath ceremony as a CM .Vijayasaray Reddy's Twitter platform, citing the reasons and criticised Babu and Babu Bhajan Sangam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X