మహానుభావుడు ఎన్టీఆర్ టీడీపీ ప్రకటించి 37 ఏళ్లు... ఆయన లేడు .. ఆయన ఆశయాలైనా ఉన్నాయా ..?
ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో ఆనాడు ఆవిర్బవించిన ఆ నూతన పార్టీ వల్ల తెలుగువాడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడడానికి కూడా కారణమయ్యింది. ఢిల్లీ పెత్దనం తారా స్థాయిలో నడుస్తున్న క్రమంలో దక్షిణదేశ ముఖ్యమంత్రుల పట్ల కేంద్ర పెద్దల ఉదాసీన వైఖరిని కూడా పారదోలింది.
ఇక ఆనాడు ఆ మహానుభావుడు నెలకొల్పిన పార్టీ ద్వారా ఎంతో మంది రాజకీయ ఓనమాలు నేర్చుకుని రాజకీయ దురందరులుగా కొనసాగుతున్నారు., రాజకీయాలు శాశిస్తున్నారు. తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు తన రాజకీయరంగ ప్రవేశ ప్రకటన చేసి గురువారం నాటికి సరిగ్గా 37 ఏళ్లయింది.
టార్గెట్ జగన్ వయా జనసేన, జేడీ? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్లోని రామకృష్ణా స్టూడియోలో 1982 మార్చి 21న విలేకర్ల సమక్షంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ వార్త అప్పటికప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తల ద్వారా తెలుగు ప్రజానీకానికి తెలిసింది. ఐతే పార్టీ స్థాపించిన మహానుభావుడు లేడు. పార్టీ ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ రూపొందించిన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు ఇంకా ఉన్నాయా అనే అంశం పై మాత్రం పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.