కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమకు న్యాయం జరిగే రోజులొచ్చాయి: మూడేళ్లలో నిర్మాణం పూర్తి: స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM YS Jagan Lays Foundation Stone For Kadapa Steel Plant | Oneindia Telugu

రాయలసీమ బాగుపడాలంటే నీరు..పరిశ్రమలు రావాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర విభజన చట్టంలో ఉందని..దీనిని గత ప్రభుత్వంలో సాధించలేకపోయారని గుర్తు చేసారు.

ఈ ఫ్యాక్టరీ ప్రముఖ సంస్థలకు అప్పగించేందుకు సంప్రదింపులు చేస్తున్నామని..అంగీకారం కుదిరితే వారికి ఇస్తామని..లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేసారు. మూడేళ్ల కాలంలో ఉక్కు పరిశ్ర మ ను పూర్తి చేసి..ప్రత్యక్షంగా..పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పుకొచ్చారు.

కడప ముఖచిత్రం మారాలని

కడప ముఖచిత్రం మారాలని

రాష్ట్ర విభజన చట్టంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉన్నా.. గత ప్రభుత్వం చొరవ తీసుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. గత అయిదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చి శంకుస్థాపన చేయటం మోసం కాదా అని ప్రశ్నించారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేయటం తమ చిత్తశుద్దికి నిదర్శనమని సీఎం చెప్పుకొచ్చారు. వైయస్సార్ రాయలసీమకు నీరు..పరిశ్రమలు..ఉపాధి కావాలని వివరించారు. సీమ ఆర్దిక..ఉద్యోగ చరిత్రను మార్చే లక్షల టన్నుల ఉక్కు కర్మాగారం శంకుస్తాపన చేయటం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సహకరించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ధన్యవాదాలు తెలిపారు.

15 వేల కోట్లు..25 వేల ఉద్యోగాలు..

తమ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పునాది రాయి వేస్తోందని చెప్పిన ముఖ్యమంత్రి..మూడేళ్ళలో నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. దీని ద్వారా ఇక్కడే..ప్రత్యక్షంగా..పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు అందుతాయని చెప్పుకొచ్చారు. పనర్విభజన చట్టంలో స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఒక్కటని..దీనిని వాస్తవంగా కేంద్రమే నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. అయితే, అది ముందుకు పోకపోవటంతో తామే ఏపీఎండీసీ ద్వారా ముందుకొచ్చామని వివరించారు. సీమకు న్యాయం జరిగే రోజులొచ్చాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పని కాకపోయినా.. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక...అదే విధంగా ఈ ప్రాంత రూపు రేఖలు మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. గతంలో ఉక్కు ఉద్యమం సందర్భంగా ఆరుగురు విద్యార్దులు..ముగ్గురు ఉద్యోగులు బలైన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసారు.

ఏపీ స్టీల్ ఏపీ హక్కుగా..

ఏపీ స్టీల్ ఏపీ హక్కుగా..

గతంలో ఉక్కు ఉద్యమం సందర్భంగా ఆరుగురు విద్యార్దులు..ముగ్గురు ఉద్యోగులు బలైన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. కానీ, ఇప్పుడు ఎటువంటి ఆందోళనలు అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ మే ముందుకు వచ్చి నిర్మాణం చేపట్టిందని వివరించారు. అనంతపురం లో కార్ల ఫ్యాక్టరీ..కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వ్యాఖ్యానించారు. సీమ ప్రాంతానికి నిధులు.. నీరు కావాలని సీఎం వివరించారు. ఈ నిర్మాణాల ద్వారా సీమ ప్రాంతంలో ఉద్యోగాల్లో కొత్త శకానికి నాంది పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

English summary
The Chief Minister Jagan laid the foundation stone for the Kadapa Steel Plant. Cm says nearly 15 thousand cr investing for this plant and it may create about 25 thousand jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X