ప్రజా వేదిక వస్తువులను వేలం వెయ్యనున్న సీఆర్డీఏ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేసిన విషయం తెలిసిందే .అప్పట్లో చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అని కూల్చివేసింది ఏపీ సర్కార్ . ప్రభుత్వ కార్యాకలాపాలకువినియోగించుకోవాలని పలువురు సూచించినా సరే అవేవీ వినకుండా అక్కడ ఉన్న ఫర్నీచర్ అంతా తరలించి ప్రజావేదికను కూల్చి వేసి అక్రమ కట్టడాలను తొలగిస్తామని తేల్చి చెప్పింది.
రైతుల అడ్డగింతపై రోజా సీరియస్ ... చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ఇంచు కూడా కదలనివ్వమని వార్నింగ్
ఇక తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన ప్రజావేదిక నుండి తరలించిన సామాగ్రిని వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను 9 నెలల క్రితం అధికారులు కూల్చివేసిన సమయంలో అక్కడ ఉన్న కూలర్లు, ఏసీలు, ఫర్మీచర్ ను అక్కడ నుండి తరలించారు. ఇక ప్రజా వేదికకను అనుమతుల్లేవంటూ దాన్ని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ఆదేశించిన మేరకు సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు.
Recommended Video
అప్పటి నుండి పక్కన పడేసిన ఏసీలు, కూలర్లు, ఫర్మీచర్, ఇంకా కొన్ని ఉపయుక్త పరికరాలను చివరకు వేలం వేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఇక వాటిని వేలంలో కొనుగోలు చెయ్యాలనుకున్న వారు మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, వేలానికి దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రజావేదిక ఫర్నీచర్, సామాగ్రి వేలం నిర్వహించనున్నారు.