వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపిలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ అత్యంత సన్నిహితులకే..!చివరికి ఆ పోస్టు కూడా..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పందవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి ప‌ద‌వి సైతం ఆ పోస్టు ముందు దిగ‌దుడుపే. అంబానీ లాంటి వారు సైతం నేరుగా కాంటాక్ట్ లోకి వ‌చ్చేసే ప‌వ‌ర్ ఫుల్ ప‌ద‌విగా చెప్పే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రిక‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ కీల‌క ప‌ద‌వికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎవ‌రికి క‌ట్ట‌బెడ‌తార‌న్న దానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. గ‌జ‌న్ కు అత్యంత స‌న్నిహితులు.. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఎంపికి చేయ‌నున్నారు.

పార్టీ కోసం సుబ్బారెడ్డి చేసిన త్యాగాల‌కు ప్ర‌తిగా ఈ కీల‌క ప‌ద‌వికి ఆయ‌న్ను ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ఇదే విష‌యంపై జ‌గ‌న్ తుది నిర్ణ‌యం తీసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన నియామ‌క ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో జారీ కానున్న‌ట్లుగా అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీకి విధేయుడిగా ఉండ‌ట‌మే కాదు.. పార్టీ కోసం త్యాగాల‌కు ఏ మాత్రం వెనుకాడ‌ని వ్య‌క్తిత్వం సుబ్బారెడ్డి సొంతంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

The most important posts in the NCP are the closest friends! Finally that post .. !!

ప్ర‌త్యేక హోదా కోసం త‌న ఎంపీ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేసి.. రాజీనామా చేయ‌టం ఒక ఎత్తు అయితే.. పార్టీ అంత‌ర్గ‌త స‌ర్దుబాటులో భాగంగా ఒంగోలు ఎంపీ సీటు నుంచి బ‌రిలో దిగ‌కుండా ఉండటాన్ని మ‌ర్చిపోలేం. జ‌గ‌న్ మాట‌తో 2019 ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ఉండిపోయిన సుబ్బారెడ్డి.. పార్టీకి.. జ‌గ‌న్ కు ఎంతో విధేయులు. తాను పోటీలో లేకున్నా.. ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థి విజ‌యం కోసం విప‌రీతంగా శ్ర‌మించిన గొప్ప‌త‌నం సుబ్బారెడ్డిది.

అలాంటి ఆయ‌న కు కీల‌క ప‌ద‌విని క‌ట్టబెట్టాల‌న్న నిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లుగా తెలిసింది. జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాల కోసం దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు సుబ్బారెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి ఉన్న సుబ్బారెడ్డి.. పార్టీ సంక్షోభం సమయాల్లో జ‌గ‌న్ కు అండ‌గా నిలిచారు. న‌మ్ముకున్న వారికి పెద్ద పీట వేసే వైఎస్ ఫ్యామిలీకి త‌గ్గ‌ట్లే .. తాజాగా జ‌గ‌న్ నిర్ణ‌యం అదే రీతిలో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

English summary
Clarity came to know about the position of Chairman of the Board of Thirumala Tirupati Devasthanam, who is the Power Officer. There was a clarity on which AP chief minister YS Jaganmohan Reddy was building for this key post. Very close friends to Jagan. Former MP yv Subbara Reddy will be made to chairman to ttd. It was revealed that he was selected for this key post against Subba Reddy's sacrifices for the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X