ఇరుకైన రోడ్లు.. చురుకైన ఏర్పాట్లు చేసామన్న సీపీ ద్వారకాతిరుమలరావు
విజయవాడ/హైదరాబాద్ : ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. స్టేడియం చుట్టుపక్కల లా అండ్ ఆర్డర్, సిటిలో ట్రాఫిక్, పార్కింగ్ ప్రదేశాలు, వీఐపీల రాకకు సంబందించి మొత్తం నాలుగు విభాగాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేదిక వద్ద మైదానంలో 12 వేల సీటింగ్ ఉంటుందన్నారు. గ్యాలరీలు జనరల్ పబ్లిక్ కు కేటాయించాం.. మొత్తం స్టేడియంలో 30 వేల కెపాసిటి ఉంది.
పాస్ లు ఉన్నవారికి స్టేడియంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు.ప్రమాణస్వికారానికి గవర్నర్, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏడీయంకే అధినేత స్టాలిన్ రాబోతున్నారు. సాధారణ ప్రజలకు సిద్దార్ద కళాశాల వద్ద పార్కింగ్ కేటాయించాం. బారీ వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టబోతున్నాం. ఈరోజు రాత్రి నుండి రేపు సాయంత్రం వరుకు డైవర్షన్ కొనసాగుతుంది.
సిటిలో కూడా చిన్న చిన్న డైవర్షన్స్ పెట్టాం. పాస్ లు ఉన్నవారు 10.30 కే వెదిక వద్దకు చేరుకోవాలి.. లేకుంటే ట్రాఫిక్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏపీ పోలీస్ ,ఏపీయస్పి, అక్టోపస్ , గ్రేహౌండ్స్, డ్రోన్స్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నాము. గ్రౌండ్ కెపాసిటి 40 వేలు. అంతకన్నా ఎక్కువ మంది వస్తే బయటే ఆపేస్తాం. బందర్ రోడ్డు మీదగా వచ్చే సాధారణ వాహనాలను నాలుగు గంటలు ముందే ఆపేస్తాము ప్రజలు గమనించాలని సీపి తెలిపారు.