ఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాట
Recommended Video
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వుంది ఏపీలోని కొందరు నాయకుల పరిస్థితి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీల్లో జంప్ జిలానీల సందడి నెలకొన్నా ఉదయం వైసీపీ లో చేరి మళ్ళీ తిరిగి సాయంత్రానికే టీడీపీ కండువా కప్పుకున్న చిత్రాలైతే ఇప్పట వరకు కనిపించలేదు. తాజాగా అలాంటి విచిత్రమూ చోటు చేసుకుంది.
ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులు
ఉదయం వైసీపీలో చేరిన కొందరు తిరిగి సాయంత్రానికే టిడిపి బాట పట్టి తూచ్ అదేం లేదు అంటూ అందరినీ అవాక్కయ్యేలా చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన కొందరు కార్యకర్తలు ఉదయం ఒక పార్టీ లో చేరి.. సాయంత్రం కల్లా తిరిగి తమ సొంత పార్టీలోకి చేరిపోయారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఆదుకుంటామని చెప్తే ముందు వైసీపీలో చేరామని , వారు చెప్పింది అబద్ధం అని తెలియటంతో తిరిగి టీడీపీ కి వచ్చామని చెప్తున్న వారి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అసలు
విషయానికి
వస్తే
గుంటూరు
జిల్లా
మునగోడు
లో
వ్యక్తిగత
కారణాలు,
ఆర్ధిక
ఇబ్బందులతో
ఉన్న
తమను
ఆదుకుంటామని
ప్రతిపక్ష
పార్టీ
నాయకుల
మాటలు
నమ్మి
ఉదయం
టీడీపీని
వదలి
వైసీపీలో
చేరారట
కొందరు
కార్యకర్తలు.
పార్టీలో
చేరిన
తరువాత
ఆ
పార్టీ
నాయకులు
చెప్పిన
మాటలు
అబద్దమని
తెలిసి
తిరిగి
సాయంత్రానికి
తెలుగుదేశం
పార్టీలో
చేరారట
..
గ్రామానికి
చెందిన
కొందరు
స్థానిక
నాయకుల
మాటలు
విని
నియోజకవర్గ
ఇన్చార్జి
నంబూరి
శంకరరావు
సమక్షంలో
క్రోసూరు
పార్టీ
కార్యాలయంలో
వైసీపీలో
చేరారు.
కండువాలు
వేసిన
తరువాత
తమను
ఆదుకుంటామని
చెప్పి
భోజనం
పెట్టి
పంపించారని,
కోపంతో
మరలా
స్థానిక
ఎమ్మెల్యే
డాక్టర్
కొమ్మాలపాటి
శ్రీధర్
వద్దకు
వచ్చి
తాము
తప్పు
చేశామని
తాము
టీడీపీ
కట్టుబడి
ఉంటామని
మళ్లీ
పార్టీ
తీర్ధం
పుచ్చుకున్నారు.
ఈ
విచిత్రం
చూసిన
వాళ్ళంతా
నోరెళ్ళబెట్టి
మరీ
అవాక్కయ్యారు.
అసలు
ఆదుకోవటం
అంటే
ఏమిటో
గానీ
మొత్తానికి
బడా
నేతలే
కాదు
చోటా
మోటా
లీడర్లు
కూడా
అవకాశవాద
రాజకీయాల్లో
ఆరితేరిపోయారు
అనేది
ఈ
ఘటనతో
అర్ధం
అవుతుంది.